నితిన్ పై పగ తీర్చుకున్నా అంటుంది మహానటి కీర్తి సురేష్. మరి ఆ రివేంజ్ కు కారణం ఏంటంటే.. నితిన్-కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో రంగ్ దే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ అప్పట్లో దుబాయ్ లో కొద్ది రోజులు జరుపుకున్న సంగతి కూడా విదితమే కదా. ఈనేపథ్యంలో షూటింగ్ మధ్యలో కీర్తీ సెట్లో రెస్ట్ తీసుకుంటుండగా ఆ సమయంలో నితిన్, వెంకీ అట్లూరి ఓ ఫొటో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ‘షూటింగ్తో మాకు చెమటలు పడుతుంటే తను మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోంది’ అని కామెంట్ కూడా చేశారు. అయితే ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానితో వీరిద్దరి పై కీర్తి సురేష్ రివేంజ్ తీర్చుకుంటానని చెప్పింది. ఆ తరువాత డైరెక్టర్ ను సెట్ లో పరుగుపెట్టించి రివేంజ్ తీర్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా నితిన్ పై రివేంజ్ తీర్చుకున్నా అంటుంది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఫన్నీ వీడియో షేర్ చేసింది. వీడియోలో నితిన్-కీర్తి సురేష్ ఫొటోలు మార్ఫింగ్ చేయగా.. నితిన్ తల అటూ ఇటూ కదులుతూ ఉండగా, బ్యాక్గ్రౌండ్లో ‘జిమ్మీ జిమ్మీ జిమ్మీ ఆజా’ పాట వస్తుంది. ఇక ఈ వీడియో పోస్ట్ చేసి హాయ్ అర్జున్ ఇదుగో నా రివేంజ్ అంటూ పోస్ట్ లో క్యాప్షన్ కూడా ఇచ్చింది.
Hi Arjun, here is my revenge 😈
Love, Anu. @actor_nithiin #RangDe #TeamRangDe #RangDeBTS pic.twitter.com/sdWyw1MSIU
— Keerthy Suresh (@KeerthyOfficial) March 17, 2021
కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: