జీతు జోసెఫ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మీనా జంటగా `దృశ్యం` సీక్వెల్ దృశ్యం 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాను ప్రారంభించగా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో రానా కూడా నటించనున్నట్టు వార్తలు జోరుగా వినిపించిన సంగతి కూడా విదితమే. మలయాళంలో మురళీ గోపీ చేసిన కొత్త ఇన్స్పెక్టర్ పాత్రను తెలుగులో రానా చేయనున్నాడని అన్నారు. అయితే ఇప్పుడు ఈవార్తలపై స్పందించిన రానా క్లారిటీ ఇచ్చాడు. రానా ప్రధాన పాత్రలో నటించిన అరణ్య సినిమా ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్యూలో ఈ ప్రశ్న అడుగగా.. తాను దృశ్యంలో నటించట్లేదని.. అవి కేవలం రూమర్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు. మరి ఇప్పటికైనా ఈరూమర్స్ ఆగుతాయేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, ఆశిర్వాద్ సినిమాస్, రాజ్కుమార్ థియేటర్ ప్రై.లి పతాకాలపై డి. సురేష్బాబు, ఆంటోని పెరుంబవూర్, రాజ్కుమార్ సేతుపతి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా సతీష్ కురూప్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు.
ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా “హాథీ మేరే సాథీ ” . తెలుగులో ‘అరణ్య’, తమిళ్లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు రానా.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: