ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన గుణశేఖర్ ఇప్పుడు శాకుంతలం అనే అద్భుతమైన ప్రేమకావ్యాన్ని చూపించడానికి వచ్చేస్తున్నాడు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ఈసినిమాను చాలా గ్రాండియర్ గా రూపుదిద్దనున్నాడు గుణశేఖర్. ఇక మేకింగ్ పరంగా తనదైన పంథాలో గుణశేఖర్ శాకుంతలం కోసం భారీ సెట్స్ను వేస్తున్నారు. అంతేకాదు సెట్స్ విషయాలు, దుస్తులు, కేళాలంకరణలు ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈసినిమా నేడు గ్రాండ్ గా లాంచ్ అయింది.అల్లుఅరవింద్, సమంత, దేవ్ మోహన్, దిల్ రాజు, గుణశేఖర్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు మూవీ షూటింగ్ మొదలు పెట్టి 2022లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
ఇక ఈసినిమాలో సమంత సరసన దుష్యంతుడి పాత్రలో నటించే ఛాన్స్ ఎవరికి దొరుకుతుందా అని అనుకున్నారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ చిత్రంలో దుష్యంతుడిగా నటిస్తున్నాడు. మరో హీరోయిన్ పాత్రకు తెలుగు అమ్మాయి ఈషాను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: