ఈ ఏడాది మార్చి మాత్రం వరస సినిమాల రిలీజ్ లతో మాములు హడావుడిగా లేదు. మార్చి 5 న పవర్ ప్లే, ఏ1 ఎక్స్ ప్రెస్, షాదీముబారక్, గజకేసరి లాంటి సినిమాలు రిలీజ్ అవ్వగా.. మార్చి 9న గాలి సంపత్, జాతి రత్నాలు, శ్రీకారం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు కూడా మంచి టాక్ నే సొంతం చేసుకున్నాయి. ఇక మార్చి19న బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి మరో మూడు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి నటించిన చావు కబురు చల్లగా సినిమా, విష్ణు-కాజల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మోసగాళ్ళు, ఆది-సురభి కాంబినేషన్ లో వస్తున్న శశి సినిమా. ఈ మూడు సినిమాలపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మోసగాళ్ళు
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశారు చిత్రయూనిట్. ఇక మార్చి 19న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు.. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.
చావుకబురు చల్లగా
కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, టీజర్ గ్లిమ్ప్స్, మైనేమ్ ఈజ్ రాజు పాటను విడుదల చెయ్యగా వాటికి మంచి స్పందన లభించింది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగానే చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో మురళీ శర్మ, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్,భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
శశి
శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఆది హీరోగా ‘శశి’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ,ట్రైలర్ ల వల్ల ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. ఇక మార్చి 19న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. కాగా లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్ హీరోయిన్లు గా నటిస్తుండగా రాజీవ్ కనకాల, జయప్రకాష్, అజయ్, వెన్నెల కిషోర్, రాశి సింగ్, తులసి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: