విడుదలై వారం రోజులు అవుతున్నా ఇంకా ‘ఉప్పెన’ సినిమా గురించే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయకుండా పట్టుబట్టి థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ ఆగి.. థియేటర్స్ లోనే ఎందుకు రిలీజ్ చేశారో.. ఈ సినిమాపై అంత నమ్మకంగా ఎలా వున్నారో.. దానికి ఈ సినిమా ఇచ్చిన సక్సెసే నిలువెత్తు నిదర్శనం. ఈ సినిమా రిలీజ్ అయి పది రోజులు అవుతుంది ఇంకా పలు ప్రాంతాల్లో మంచి కలెక్షన్సే రాబట్టుకుంటుంది. అంతేకాదు ఎంతోమంది సినీప్రముఖుల ప్రసంశలు అందుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమాను చూసిన మహేష్ కూడా చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ నేపథ్యంలో మహేష్ తన ట్విట్టర్ వేదికగా ఉప్పెన ఒక్క మాటలో చెప్పాలంటే ‘క్లాసిక్’.. బుచ్చిబాబు ఒక గొప్ప చిత్రాన్ని రూపొందించారు…చాలా గర్వంగా ఉంది.. అంతేకాదు ‘ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం గుండె లాంటిది. ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఈ సినిమా మీ బెస్ట్ వర్క్. ఎప్పటికీ గుర్తుండిపోయే సంగీతం ఇచ్చారు… ఇంకా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి మీ అద్భుతమైన నటనతో హృదయాలను గెలుచుకున్నారు.. మీరిద్దరూ గొప్ప స్టార్లు.. ఇక ఫైనల్ గా ఉప్పెన సినిమాను వెనుక నుండి నడిపిన సుకుమార్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ కు హ్యాట్సాఫ్.. అంటూ తన ట్వీట్స్ తో పొగడ్తలు కురిపించాడు. మరి మంచి జోష్ లో ఉన్న ఉప్పెన టీంకు మహేష్ ట్వీట్స్ మరింత ఎనర్జీని ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు కదా.
The heart of Uppena is @ThisisDSP… it’ll be remembered as one of the all time great music scores! This is your best work till date DSP… Keep rocking!
— Mahesh Babu (@urstrulyMahesh) February 22, 2021
And finally hats off to @aryasukku garu and @MythriOfficial for backing a project like Uppena. Like I said it’s one of those timeless films… Proud of you guys!
— Mahesh Babu (@urstrulyMahesh) February 22, 2021
కాగా సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: