పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతుంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక అక్కడి షూటింగ్ కు సంబంధించి పలు ఫొటోలు.. లొకేషన్స్ కు సంబందించిన ఫొటోలు ఇప్పటికే మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మహేష్ తాజాగా దుబాయ్ పోలీస్ స్టేషన్ను చూపించారు. లా మెర్లోని దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ సందర్శించిన మహేష్… ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ పోలీస్ స్టేషన్, ఇది మనుషులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలను అందిస్తుంటుంది ఇలాంటిది గతంలో ఎప్పుడు చూడలేదు..అద్భుతమైన అనుభవం అని పేర్కొన్నాడు.
View this post on Instagram
కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 20 రోజుల పాటు దుబాయ్లో తొలి షెడ్యూల్ చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్లో రెండో షెడ్యూల్ జరగనుంది. మిగిలిన నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. ఇక ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: