కామెడీ హీరోగానే కెరీర్ ను ప్రారంభించిన అల్లరి నరేష్ కేవలం కామెడీ సినిమాలే కాదు నేను, గమ్యం, శంభో శివ శంభో ఈమధ్య కాలంలో వచ్చిన మహర్షి సినిమాలో చేసిన పాత్ర ఇలా కొన్ని గుర్తుండిపోయే పాత్రలు చేసాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి సీరియస్ పాత్రతో మనముందుకు వచ్చేస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ ‘నాంది’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. దోషా.?నిర్దోషా..? జడ్జిమెంట్ ఫిబ్రవరి 19న రానుంది అంటూ రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అల్లరి నరేష్ నాంది అనే చిత్రంతో ఎలా అయిన హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. మరి చూద్దాం ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: