బాహుబలి1, బాహుబలి2 సినిమాల కోసం దాదాపు ఐదేళ్లు టైమ్ తీసుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత సాహో సినిమాకు దాదాపు రెండేళ్లు.. రాధే శ్యామ్ సినిమా కు కూడా అంతే టైమ్ తీసుకున్నారు.. దీనితో ప్రభాస్ సినిమా రావాలంటే మినిమమ్ రెండేళ్లు టైమ్ తీసుకోవాల్సిందే అన్న అభిప్రాయానికి వచ్చేసారు అందరూ. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తపడుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వున్నాయి. వాటిలో రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ తో సినిమా, ఓం రౌత్ తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ తో సలార్. అన్నీ ఒకదానికి మించి ఒకటి పెద్ద ప్రాజెక్టులే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాధేశ్యామ్ చేస్తూనే ‘కెజిఎఫ్’ ఫేమ్ ప్రశాంత్నీల్తో ‘సలార్ సినిమాను ప్రారంభించారు. సలార్ షూటింగ్ కూడా జరుగుతుంది ప్రస్తుతం. ఇక ఇప్పుడు ఆదిపురుష్ కూడా మొదలు పెట్టాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, ముంబైలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేసారు చిత్రయూనిట్.
#Adipurush aarambh. #Prabhas #SaifAliKhan #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/LbHvEFhmFF
— Om Raut (@omraut) February 2, 2021
కాగా మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.ఇక సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోందని, తల్లి పాత్రలో హేమమాలిని నటిస్తోందని, లక్ష్మణుడిగా టైగర్ ష్రాఫ్ని ఎంపిక చేసారని అనేక వార్తలు వచ్చాయి. వీటిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఆగస్ట్ 11,2022న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: