పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే పలు మూవీ ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “రాధేశ్యామ్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్న పూజాహెగ్డే , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ , బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్ ” మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా గోపీకృష్ణా మూవీస్ సమర్పణ లో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసిన పూజాహెగ్డే ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. పూజాహెగ్డే మాట్లాడుతూ .. ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ కావడానికి సుమారు 6 నెలల సమయం పడుతుందనీ , పెద్ద సినిమాలు అయితే ఇంకా ఎక్కవ సమయం పడుతుందనీ , షూటింగ్ సమయం లో చాలా మంది కొత్తగా స్నేహితులవుతారనీ , సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత వారిని కలుస్తామో లేదో తెలియదనీ , వారితో స్నేహ బంధం తెంచుకొనడం కష్టంగా ఉంటుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: