సీనియర్ నిర్మాత వి.దొరస్వామి రాజు ఈ రోజు కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో… అనారోగ్యంతో ఆయన బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కాగా వి.దొరస్వామి రాజు మృతికి జూనియర్ ఎన్టీఆర్, ఎస్.ఎస్.రాజమౌళి సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘‘డిస్ట్రిబ్యూటర్గా వెయ్యికి పైగా సినిమాలను దొరస్వామి రాజు గారు విడుదల చేశారు. కొన్ని అద్భుతమైన మరపురాని తెలుగు సినిమాలను కూడా ఆయన నిర్మించారు. వీఎంసీ బ్యానర్ నుంచి వచ్చిన ఆణిముత్యాల్లో ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘అన్నమయ్య’ లాంటి చిత్రాలు కొన్ని. నా కెరీర్ను మలుపు తిప్పిన ‘సింహాద్రి’ సినిమాకు ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.
ఇక ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా దొరస్వామికి సంతాపం తెలియచేసాడు. దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని ట్వీట్ చేసాడు.
దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను
— Jr NTR (@tarak9999) January 18, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: