మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా రూపొందిన “ఉప్పెన” మూవీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. “ఉప్పెన” మూవీ తో హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకొనడం విశేషం. ఈ రోజు హీరో వైష్ణవ్ తేజ్ బర్త్ డే సందర్భంగా “ఉప్పెన “మూవీ యూనిట్ టీజర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 5వ తేదీ “ఉప్పెన “మూవీని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. “ఉప్పెన “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: