స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న “లాభం “తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న “వకీల్ సాబ్ “మూవీ లో శృతి కథానాయికగా ఎంపిక అయ్యారు. “గబ్బర్ సింగ్ “, “కాటమ రాయుడు ” మూవీస్ తో పవన్ కళ్యాణ్ , శృతి జోడీ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ శృతి , అభిమానులతో తన జీవిత విశేషాలను పంచుకుంటున్నారు. శృతి ఇప్పుడు కెరీర్ పై దృష్టి పెట్టారు. “క్రాక్ “, “వకీల్ సాబ్ “మూవీస్ తో పూర్వపు వైభవం వస్తుందనే ఆశాభావంతో శృతి ఉన్నారు. శృతి ఒక ఇంటర్వ్యూ లో తన కోరికను వెల్లడించారు. టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , రామ్ చరణ్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లకు జోడీగా నటించిన శృతి మాట్లాడుతూ ..హీరో ప్రభాస్ తో నటించాలని ఉందనీ , ప్రభాస్ తో నటించడం తన కల అనీ , ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే రెమ్యూనరేషన్ తనకు సమస్య కాదనీ చెప్పారు. శృతి కల త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























