‘విరాటపర్వం’ – కీలక పాత్రలో నివేదా పేతురాజ్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా జాయిన్ అవుతుంది. ఆ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో కాదు నివేదా పేతురాజ్. నివేదా పేతురాజ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో ఆమె కూడా పాల్గొందని తెలుస్తుంది.
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ డబ్బింగ్ స్టార్ట్
సుశాంత్ S. దర్శన్ దర్శకత్వంలో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించగా.. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తి చేసుకుంది..ఇక తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డబ్బింగ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా సుశాంత్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు.
‘శ్యామ్ సింగరాయ్’ గ్రాండ్ లాంచ్
టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా తాజాగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఈ మూవీ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ అయింది. నాని తండ్రి ఘంటా రాంబాబు..నాని, కృతిశెట్టి, సాయిపల్లవిపై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా… మేర్లపాక గాంధీ కెమెరా స్విచ్చాన్ చేయగా..అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించాడు. శివనిర్వాణ, వెంకీ కుడుముల స్క్రిప్ట్ ను నిర్మాతకు అందజేశారు.
ఘనంగా జరిగిన నిహారిక పెళ్లి
ఫైనల్ గా కుమారి నిహారిక కాస్త శ్రీమతి నిహారిక అయిపోయింది. గత నాలుగు రోజులుగా మెగా డాటర్ నిహారిక సందడి చూస్తూనే ఉన్నాం.. సోషల్ మీడియాలో పెళ్లికి సంబందించిన ఫొటోలు కూడా చాలా వైరల్ అవుతూనే ఉన్నాయి. జైపూర్లోని ఉదయ్విలాస్ ప్యాలెస్ లో డిసెంబర్ 9న సాయంత్రం 7 గంటలకు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య నిహారిక మెడలో మూడు ముళ్లు వేసాడు.
‘తిమ్మరుసు’ టీజర్ రిలీజ్
టాలెంటెడ్ యాక్టర్ నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేసింది. ఇక ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. కాగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో కలిసి ఎస్ ఒరిజినల్స్ బ్యానర్పై నిర్మాత సృజన్ ఎరబోలు ‘తిమ్మరుసు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తున్న సినిమా ’డర్టీ హరి‘. రొమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని… విడుదలకు సిద్ధంగా ఉంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈ సినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ట్రయిలర్ 2.0 పేరుతో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
Here’s Vibrant Trailer 2️⃣.0️⃣ from @MSRajuOfficial‘s #DirtyHari 😋 ► https://t.co/mZCFAVnqCK#DirtyHari Premieres Dec 18th on @FridayMoviesATT@HylifeEnt @SpjCreations @ShravanReddy7_ @iRuhaniSharma @simratkaur_16 @markkrobin pic.twitter.com/WfzvjZjVIX
— Telugu FilmNagar (@telugufilmnagar) December 9, 2020
తమిళ నటుడు శరత్కుమార్ కు కరోనా పాజిటివ్
కరోనా ప్రభావం తగ్గుతున్నా సినీ సెలబ్రిటీస్ ను మాత్రం కరోనా వదిలిపెట్టేలా కనిపించట్లేదు. విచిత్రం ఏంటంటే కరోనా లక్షణాలు కనిపించకుండా కూడా కరోనా పాజిటివ్ రావడం. ఇప్పుడు మరో సెలెబ్రిటీకి కూడా అలానే కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. తమిళ సినీ నటుడు శరత్కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా లక్షణాలు ఏమీ లేకుండానే పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయన భార్య రాధికాశరత్కుమార్ తెలిపారు. శరత్కుమార్ ప్రస్తుతం బాగానే ఉన్నారని.. కోలుకుంటున్నారని ఆమె తన ట్వీట్ ద్వారా తెలిపారు.
Today Sarath tested positive for Coronavirus in Hyderabad. He’s asymptomatic and in the hands of extremely good doctors! I will keep you updated about his health in the days to come. @realsarathkumar @rayane_mithun @imAmithun_264 @varusarath5
— Radikaa Sarathkumar (@realradikaa) December 8, 2020
‘సరిలేరు నీకెవ్వరు’ ఖాతాలో మరో రికార్డ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది.
ఈ సినిమా తాజాగా సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ట్విట్టర్లో మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ట్యాగ్ 2020 గా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నిలిచింది.
Superstar @urstrulymahesh‘s Sarileru Neekevvaru continues Ruling 🔥
‘#SarileruNeekevvaru‘ marks Most tweeted movie tag of TFI on @TwitterIndia 💥💥💥
Thanks to all the Superfans ❤️#MovieOfTheYear 🤘#ThisHappened @AnilRavipudi @AnilSunkara1 @ThisIsDSP https://t.co/f3GBnAGXBO pic.twitter.com/Yyt8eAPrln— AK Entertainments (@AKentsOfficial) December 8, 2020
మహాసముద్రం షూటింగ్ స్టార్ట్
శర్వానంద్ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో రేంజ్ అందుకున్న సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలు షూటింగ్ లను మొదలు పెట్టగా.. ఫైనల్లీ మహాసముద్రం సినిమా కూడా పట్టాలెక్కింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నుకూడా మొదలు పెట్టారు. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది.
I can’t wait to show you this fierce love story, an intense drama with phenomenal characterizations! Something you’ve never experienced before! I’m sure you’ll ❤️ it.
Excited to start the shoot today 🔥#MahaSamudram 🌊#MahaSamudramBegins ❤️ @ImSharwanand @Actor_Siddharth pic.twitter.com/EbR3iUazRY— Ajay Bhupathi (@DirAjayBhupathi) December 7, 2020
“రౌద్రం రణం రుధిరం” సెట్స్ లో అలియా భట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “రౌద్రం రణం రుధిరం ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. “రౌద్రం రణం రుధిరం ” మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ హైదరాబాద్ కు చేరుకున్నారు . షూటింగ్ లో పాల్గొంటున్నారు.
నితిన్ ‘అంధాధున్’ రీమేక్ షూటింగ్ మొదలు
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ 30 సినిమాగా అంధాధున్ సినిమా రీమేక్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైంది. దుబాయ్ లో ఈ సినిమా షూట్ ను మొదలుపెట్టారు. నితిన్, నభా నటేష్పై దుబాయ్లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
#Nithiin30 shoot starts!! @GandhiMerlapaka @tamannaahspeaks @NabhaNatesh #sagarmahati pic.twitter.com/HDRjnFpKQa
— nithiin (@actor_nithiin) December 6, 2020
“కెజిఎఫ్ చాప్టర్ 2″మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” కన్నడ మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “మూవీ టీజర్ ను హీరో యష్ బర్త్ డే రోజున రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు.
జాంబీరెడ్డి టీజర్ రిలీజ్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జాంబీరెడ్డి’. బాల నటుడిగా పరిచయమైన తేజా సజ్జా ఈ సినిమాతో హీరోగా మారబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లకూ, మోషన్ పోస్టర్కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేసింది. ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ వర్క్ మొదలైనట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: