డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీహరి తనయుడు మేఘాంష్, సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్న హీరోలుగా ‘కోతి కొమ్మచ్చి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దివంగత శ్రీహరి గారి జయంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్ని రోజులు షూటింగ్చేస్తూ వచ్చారు. ఇక తాజా సమాచారం సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. షూటింగ్ మొదలు పెట్టి కేవలం నెల రోజులు మాత్రం అయింది.. ఎయిడ్ కూడా అవుట్ డోర్ షూటింగ్.. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేయడం నిజంగా గొప్ప విషయమే. ఇంకా ఒక్క పాట మాత్రమే ఉన్నట్టు చిత్రయూనిట్ తెలుపుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటుండగా… అతి త్వరలోనే సినిమా విడుదల తేదిను ప్రకటించి ప్రేక్షకులను ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాను ‘లక్ష్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎమ్.ఎల్.వి సత్యనారాయణ నిర్మించనున్నారు.
మరి ఇంతవరకూ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కుటుంబ విలువలతో సినిమాలు తీసిన సతీష్ వేగ్నేశ ఇప్పుడు ఈ ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ చిత్రం తెరకెక్కించబోతున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎంతవరకూ సక్సెస్ అందిస్తుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: