చాలా మంది సినీ తారలు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెప్పడం తెలిసిందే. సాయి పల్లవి మెడిసిన్ కంప్లీట్ చేసి చిత్రసీమకు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్” ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి ఆ మూవీ లో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి
ప్రస్తుతం నాగచైతన్య “లవ్ స్టోరీ “, రానా దగ్గుబాటి “విరాట పర్వం ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందనున్న “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ లో సాయి పల్లవి కథానాయికగా ఎంపిక అయ్యారు. వైద్య వృత్తి గురించి సాయి పల్లవి మాట్లాడుతూ .. డాక్టర్ గా సేవలందించడం తనకెంతో ఇష్టమనీ , సినిమాల నుండి తప్పుకున్నాక డాక్టర్ గానే స్థిరపడతాననీ, అదే వృత్తి లో జీవితాన్ని సాగిస్తాననీ , చిత్ర సీమ కు పరిచయం కాకముందే ఈ నిర్ణయం తీసుకున్నాననీ చెప్పారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “ఫిదా “, “లవ్ స్టోరీ “మూవీస్ లో నటించిన సాయి పల్లవి శేఖర్ గారు తనకు చాలా విషయాలలో మార్గదర్శనం చేస్తుంటారనీ , తనకు మంచి విజ్ఞానాన్ని అందించిన వ్యక్తులలో ఒకరనీ , శేఖర్ కమ్ములను ప్రశంసించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: