సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన షాలిని పాండే , ఆ మూవీ లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “మహానటి “, “118 “మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన షాలిని “100%కాదల్ “మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. రీసెంట్ గా రిలీజ్ అయిన “నిశ్శబ్దం” మూవీ లో ఒకముఖ్య పాత్రలో నటించారు. తెలుగు , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన షాలిని ఇప్పుడు బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై దివ్యంగ్ ఠాగూర్ దర్శకత్వంలో స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ , షాలిని జంటగా రూపొందిన సోషల్ కామెడీ మూవీ “జయేష్ భాయ్ జోర్దార్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. షాలిని ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ లో కథానాయిక గా ఎంపిక అయినట్టు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ బాలీవుడ్ కు హీరోగా పరిచయం కానున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందనున్న ఆ మూవీ లో షాలిని కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. వరస హిందీ మూవీస్ తో షాలిని బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: