అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో కూడా వచ్చేసిన సంగతి విదితమే. బుల్లి తెరపై కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయినా కూడా ఇప్పటికీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా తాజాగా సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ట్విట్టర్లో మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ట్యాగ్ 2020 గా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నిలిచింది. అయితే మహేష్ కు ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇది ముచ్చటగా మూడోసారి. 2018 లో ‘భరత్ అనే నేను’, 2019 లో ‘మహర్షి’ సినిమాలు ఆయా సంవత్సరాల్లో మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ట్యాగ్స్తో టాప్ ప్లేస్లో నిలిచాయి.
Superstar @urstrulymahesh‘s Sarileru Neekevvaru continues Ruling 🔥
‘#SarileruNeekevvaru‘ marks Most tweeted movie tag of TFI on @TwitterIndia 💥💥💥
Thanks to all the Superfans ❤️#MovieOfTheYear 🤘#ThisHappened @AnilRavipudi @AnilSunkara1 @ThisIsDSP https://t.co/f3GBnAGXBO pic.twitter.com/Yyt8eAPrln— AK Entertainments (@AKentsOfficial) December 8, 2020
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవలే లాంఛనంగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. 2021 జనవరి నుండి ఈ సినిమాషూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: