సాహితి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ను తీస్తున్నట్టు ఎప్పుడైతే ప్రకటించాడో అప్పటినుండి ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆసక్తిని పెంచుతూనే ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేసాడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సారి ఈ ట్రైలర్ను రిలీజ్ చేశారు. తండ్రి తన కూతురిని గారాబంగా చూడడం, అమృత ప్రేమలో పడడం, ప్రణయ్ హత్య ఇలా తదితర అంశాలు ట్రైలర్లో చూపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నాణానికి రెండు కోణాలు ఉంటాయి అన్నట్టు.. రామ్ గోపాల్ వర్మ వాదన ఒకటి అయితే తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మర్డర్ మూవీని నిర్మించాడని ట్రైలర్, పాటలో వాస్తవాలకు దూరంగా ఉన్న అంశాలను చూపించాడని ఆమృత తీవ్ర అభ్యత్తరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రణయ్ తండ్రి బాలస్వామి నల్గొండ జిల్లా కోర్టులో పిటీషన్ కూడా వేయగా విచారణ అనంతరం సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ను కోర్టు ఆదేశించింది. దీనితో అడ్డంకులు తొలగిపోయాయి.
All Hurdles cleared for MURDER release 💐💐💐 Coming to kill in theatres 💪💪💪 pic.twitter.com/YhZjbkadkJ
— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2020
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ను రామ్గోపాల్ వర్మ తన ట్విటర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. మర్డర్ సినిమా విడుదలకు సంబంధించిన ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ను ఆయన పోస్ట్ చేశారు. అంతేకాదు ‘మర్డర్ మూవీ విడుదలకు సంబంధించి అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఇక థీయేటర్లలో చంపడానికి ‘మర్డర్’ సినిమా త్వరలోనే రాబోతుంది’అని ఆయన కాప్షన్ జతచేశారు. చూద్దాం మరి ఈ సినిమా ఎలా వుండబోతుందో.
ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్ చంద్ర రచనా, దర్శకత్వం వహిస్తున్నారు. మిర్యాలగూడకు చెందిన అమృత, ఆమె తండ్రి మారుతిరావుల కథ ఆధారంగా వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: