మిస్ మంగుళూరు గా టైటిల్ అందుకున్న మోడల్ నేహా శెట్టి బ్లాక్ బస్టర్ “ముంగారు మలే2 “కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన “మెహబూబా ” మూవీ తో నేహా శెట్టి కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ లో ఒక కీలక పాత్రకు నేహా శెట్టి ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేహా శెట్టి ఇప్పుడు మరో తెలుగు మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. స్టార్ రైటర్ కోన వెంకట్ నిర్మాణ సారధ్యంలో జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఒక ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో నేహా శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. పలు ఎంటర్ టైనర్ మూవీస్ ను తెరకెక్కించిన నాగేశ్వర రెడ్డి , హీరో సందీప్ కిషన్ కాంబినేషన్ లో యాక్షన్ కామెడీ “తెనాలి రామకృష్ణ BABL” మూవీ రూపొందిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: