దర్శకుడు బాలచందర్ పరిచయం చేసిన ఎంతో మంది గొప్ప నటుల్లో రజినీ ఒకరు. కె. బాల చందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు రజనీకాంత్. అప్పటినుండి ఇప్పటివరకూ తన నటనతో.. స్టైల్ తో ప్రేక్షకులను అలరిస్తూనే వున్నారు. తమిళ్, తెలుగు, హిందీ ఒక్క భాష కాదు.. ఒక్క దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న హీరో ఎవరైనా వున్నారంటే అది రజినీ కాంత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఇదిలా ఉండగా రజినీ సినీ ప్రయాణంలో తమిళ, కన్నడ, హిందీ, తెలుగుల్లో అనేకమంది కథానాయకులతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే తన భార్య లత తో కలిసి కూడా ఒక సినిమాలో నటించారన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. శివకుమార్, సరిత, కమల్ హాసన్, రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో కె. బాలచందర్ దర్శకత్వంలో అగ్నిసాక్షి అనే తమిళ్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగులో విచిత్ర పెళ్ళాం అనే టైటిల్ తో డబ్ చేశారు. ఇక ఈ సినిమాలోనే రజినీకాంత్ భార్య లతా కూడా నటించారు. మీరు కూడా ఆ వీడియో ఒకసారి చూడండి.
ఇక ఈ ఏడాది ‘దర్బార్’ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీ కాంత్. ప్రస్తుతం తను అజిత్తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ కాంబినేషన్లో అన్నాతై సినిమా చేస్తున్నాడు. ఖుష్బూ,మీనా హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాలో…. కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో నటిస్తోంది.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.