ప్రస్తుతం ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలే లైన్ లో పెట్టాడు. ఇక ప్రస్తుతం అయితే రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఇటలీలో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుపుకోనుంది చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ కోసం డైరెక్టర్ ఇంకా క్రూ సభ్యులు సెట్ మొత్తం బ్లూ స్క్రీన్స్ వేసి అంతా రెడీ గా ఉంచారు. ఇంకా ప్రభాస్, పూజా హెగ్డే షూట్ లో పాల్గొనడమే ఉంది. ఈ షూటింగ్ తో దాదాపు షూటింగ్ పూర్తయినట్టే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ కు సంబంధించిన లుక్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ న్యూ లుక్ లో ప్రభాస్ కాస్త సన్నగా కనిపిస్తున్నాడు. ఇక ఈ లుక్ పై అప్పుడే పలు వార్తలు మొదలయ్యాయి. ఈ లుక్ ఆదిపురుష్ సినిమా కోసమా లేక నాగ్ అశ్విన్ సినిమా కోసమా అన్న వార్తలు స్టార్ట్ అయ్యాయి. మరి ఏ సినిమా కోసమో తెలియాలంటే మాత్రమే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
#Prabhas anna latest pic😍👌 pic.twitter.com/jICTh8bIQP
— thyview (@thyviieww) November 21, 2020
కాగా నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్తో రూపొందించనున్నారు.ఇంకా తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాలు 2021 లోనే సెట్స్ పైకి వెళ్లనున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: