అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక కెరీర్ మంచి పీక్స్ లో వున్నప్పుడే సినిమాలకు దూరమైంది. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీ గా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజాగా తన గ్యాప్ పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. నా కెరీర్ కు ఎప్పుడూ బ్రేక్ రాదు నేనే బ్రేక్ తీసుకుంటాను.. నేను కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. సినిమాలు ఒక్కటే కాదు.. ఇంకా చాలా పనులు చేస్తుంటాను. మోడలింగ్, పెయింటింగ్, సంగీతం లాంటి పనులతో చాలా బిజీ గా ఉంటా.. అందుకే గ్యాప్ తీసుకుంటా. ఒక్కోసారి ఒక్కో రంగంలో బిజీగా ఉంటా.. ఒక్కోదానికి కొంత గ్యాప్ తీసుకుంటా అని చెప్పుకొచ్చింది. ఇక శృతి హాసన్ నటిగానే కాదు సింగర్ గా మ్యూజిక్ కంపోజర్ గా, డ్యాన్సర్ గా కూడా తన టాలెంట్ ను చూపించిన సంగతి తెలిసిందే.
కాగా ప్రస్తుతం శృతి హాసన్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న “క్రాక్ ” మూవీలో నటిస్తుంది. దీనితోపాటు ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో కూడా శృతిహాసన్ నటించనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: