గురుపవన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే మా కథ. రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నలుగురు వ్యక్తులు కలిసి రోడ్ ట్రిప్ ను ఎలా కొనసాగించారన్నదే ఈ సినిమా కథ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. లాక్ డౌన్ కి ముందే షూటింగ్ స్టార్ట్ చేసి లడఖ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు చిత్ర యూనిట్. కరోనా వల్ల బ్రేక్ రాగ ఇటీవలే షూట్ స్టార్ట్ చేసి హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసినట్టు తెలుస్తుంది. ఇంకా మనాలి షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండగా… డిసెంబర్ కల్లా ఆ షెడ్యూల్ ను కూడా షూటింగ్ పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నలుగురు ప్రధాన పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసింది చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ లో అడ్వెంచర్ రైడర్ గా సుమంత్ అశ్విన్, రైడర్ మహేంద్రగా శ్రీకాంత్, ఎమోషనల్ రైడర్ లక్ష్మిగా భూమిక, యాంగ్రీ బర్డ్ రైడర్ మేఘనాగా తాన్యా హోప్ పాత్రలను పరిచయం చేశారు. బుల్లెట్ పై ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
కాగా గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగుతోపాటు ఇండియాలోనే ఇలాంటి జోనర్ లో వస్తున్న తొలి సినిమా ఇదే అంటున్నారు దర్శక నిర్మాతలు. చూద్దాం మరి రైడర్స్ గా వస్తున్న ఈ సినిమా వారికీ ఏంటి బ్రేక్ ఇస్తుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: