22 ఏళ్లకే చిరు ని డైరెక్ట్ చేశా

Director Vamsy Gives An interesting Insight About Working With Mega Star Chiranjeevi

తెలుగు తెరకి అపురూప చిత్రాలను అందించిన సీనియర్ డైరెక్టర్ వంశీ. ఆయన కథలు వాస్తవానికి దగ్గరగా .. ఆయన కథల్లోని పాత్రలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అంతేకాదు ఒక సినిమాను చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసే డైరెక్టర్ వంశీ. ఇక డైరెక్టర్ వంశీ అంటే మనకు ముందు సితార, లేడీస్ టైలర్, అన్వేషణ ఈ సినిమాలే గుర్తొస్తాయి. కానీ లేడీస్ టైలర్ కంటే ముందే వంశీ చిరు తో కూడా ఒక సినిమా చేసిన సంగతి చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. అసలు సంగతేంటంటే లేడీస్ టైలర్ కంటే ముందే చిరు తో మంచు పల్లకి సినిమా చేసాడు. ఇక ఈ సినిమాపై వంశీ ఒక ఇంటర్వ్యూ లో చెపుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు. నిజానికి అది తమిళ్ సినిమాను. దాన్ని తెలుగులో చేయడానికి హక్కులు తీసుకోగా ముందు బాపు, జంధ్యాల గారు, బెజెళ్ళ సత్యనారాయణ ఇలా చాలా మందిని అనుకున్నారట..అయితే ఎవరితో కుదరక అప్పట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేము సత్యనారాయణ గారికి నేను బాగ తెలుసు.. ఆయన నన్ను చేయమన్నారు. అయితే నేను మొదట ఒప్పుకోలేదు నాకు ఇంకా చాలా అనుభవం కావాలి అంటే ఉన్న అనుభవం చాల్లే అని నన్నే చేయమన్నారు. ఇంకా నేను కూడా మంచు పల్లకి సినిమాను డైరెక్ట్ చేసాను. అప్పుడు నా వయసు 22 ఏళ్లు.. అప్పటికే చిరంజీవి గారు ఫుల్ బిజీగా ఉన్నారు.. ముందు 13 రోజులు షూటింగ్ కు డేట్ ఇచ్చి ఆ తర్వాత మిగిలిన డేస్ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం ఓటీటీ రాజ్యమేలుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన కూడా వెబ్ సిరీస్ ల దిశగా అడుగులు వేస్తున్నారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వంశీ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారాన్ని ‘పొలమారిన జ్ఞాపకాలు’గా పుస్తకం రాశారు. వాటిని వెబ్ సిరీస్ గా అందించడానికి సన్నాహాలు మొదలైనట్టుగా చెబుతున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు మళ్లీ సెట్స్ పైకి వెళ్ళింది. చిరు రేపటి నుండి షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ డిసెంబర్ నుండి షూటింగ్ లో పాల్గొననుంది. కాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 18 =