పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా హాకీ నేపథ్యంలో రూపొందుతున్నస్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. హాకీ ప్లేయర్ గా నటిస్తున్న లావణ్య హాకీ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. హీరో కార్తికేయ హీరోగా రూపొందుతున్న “చావు కబురు చల్లగా “మూవీ లో లావణ్య కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ “మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి లావణ్య డెహ్రాడూన్ చేరుకొని దీపావళి పండగను తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసి హైదరాబాద్ చేరుకున్నారు. GA 2 పిక్చర్స్ బ్యానర్ పై కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ , లావణ్య జంటగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “చావు కబురు చల్లగా “మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. హీరో కార్తికేయ బస్తీ బాలరాజు గా ఒక మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇప్పుడు ఆ మూవీ షూటింగ్ లో లావణ్య జాయిన్ అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ లావణ్య అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: