గ్రీన్ ఛాలెంజ్.. ఈ ఛాలెంజ్ లో ఇప్పటివరకూ ఎంతో మంది సినీ సెలెబ్రిటీస్ పాల్గొని మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ రకుల్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేసింది. హీరో నాగచైతన్య విసిరిన ఛాలెంజ్ను స్వీకరించిన రకుల్ తాజాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మొక్కలు నాటింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. `గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒకరిద్దరి కార్యక్రమం కాదు. మనందరం కలిసి చేయాల్సిన కార్యక్రమం. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలి. ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టి ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతల`ని పేర్కొంది. తర్వాత ఈ ఛాలెంజ్కు ఏ యాక్టర్ ను నామినేట్ చేయడంలేదని తన అభిమానులందరినీ నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది. ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటి ఇతరులతో నాటించమని తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరో హీరోయిన్ నభా నటేష్ కూడా ఈ ఛాలెంజ్ను పూర్తి చేసింది. అయితే ఈ భామకు ఎవరూ ఛాలెంజ్ విసరలేదు కానీ ఆమె స్వయంగా ముందుకు వచ్చి ఈ ఛాలెంజ్ను స్వీకరించింది. దీనిలోభాగంగా బెంగళూరులోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. `రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్గారు పచ్చదనాన్ని కాపాడడం కోసం చాలా చక్కని ఛాలెంజ్ను చేపట్టారు. ఆ స్ఫూర్తితోనే నేను మొక్కలు నాటాను. అనంతరం ఈ ఛాలెంజ్కు అనూ ఇమ్మానుయేల్, నిధి అగర్వాల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్లను నామినేట్ చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: