మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పిన సంగతి తెలిసిందే కదా. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. ఆచార్య షూటింగ్ కోసం చెకప్ చేసుకోగా పాజిటివ్ వచ్చిందని చెప్పడంతో షాక్ అయ్యారు అందరూ. ఇక విషయం తెలిసిన వెంటనే సినీ సెలబ్రిటీస్ దగ్గనుండి అభిమానులు, సన్నిహితులు అందరూ చిరు త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం చిరు హోం ఐసోలేషన్లో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య చిరంజీవి ఆరోగ్యంపై స్పందిస్తూ.. ఓ లేఖ ద్వారా అన్నయ్య త్వరగా కోలుకోవాలని కోరారు. “అన్నయ్య శ్రీ చిరంజీవి గారు లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాదు ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించారు. సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యంపట్లా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు కరోనా బారినపడటంతో మేమంతా విస్తుపోయాం. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. పరీక్షల్లో మాత్రం పాజిటివ్ అని తేలింది. అన్నయ్య శ్రీ చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కోసం సాగుతున్న ప్రయోగాలు త్వరగా ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రపంచం అంతా ఆ వ్యాక్సిన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. మరో వైపు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదం ఉందనే వైద్య ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు చూస్తున్నాం. జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ” అని పవన్ కళ్యాణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లూసిఫర్ సినిమా రీమేక్ కూడా చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: