టాలీవుడ్ ను కరోనా బాగానే పట్టి పీడిస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. కొంతమంది అయితే కోలుకున్నారు కానీ కొంతమందిని మాత్రం కోల్పోకతప్పలేదు. ఎస్పీబీ లాంటి గాన గంధర్వుడిని సైతం ఈ కరోనా మహమ్మారి బలిగొంది. ఇక ఈ రోజు మెగాస్టార్ చిరు సైతం కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేసి పెద్ద షాకే ఇచ్చారు. దీనితో అందరూ చిరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా రాజశేఖర్ కూడా కరోనా వచ్చి గతకొద్దిరోజులుగా సిటి న్యూరో హాస్పిటల్లో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. అయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు అప్డేట్ ఇస్తుండటంతో పాటు.. సిటి న్యూరో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ల ద్వారా రాజశేఖర్ హెల్త్ కండీషన్ గురించి చెపుతూనే ఉన్నారు. ఇక తాజాగా రాజశేఖర్ ఆరోగ్యం కుదటపడటంతో ఆయనను హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రాజశేఖర్ డిశ్చార్జ్ సందర్భంగా.. సిటి న్యూరో సెంటర్ సిబ్బందికి, డాక్టర్ కృష్ణకు జీవితా రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. నెలరోజుల పాటు ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబసభ్యుల్లా చూసుకున్నారని.. అభిమానులు, కుటుంబ సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని సంతోషం వ్యక్తం చేసింది.
కాగా గతకొద్దిరోజుల క్రితం హీరో రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. పిల్లలు శివాని, శివాత్మికలు ముందు కరోనా నుండి కోలుకోగా ఇటీవలే జీవిత కూడా రికవరీ అవ్వడంతో ఆమె కూడా కోలుకున్నారు.
ఇక గరుడవేగతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత వచ్చిన కల్కి కూడా బాగానే ఆడింది. అయితే కల్కి తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు రాజశేఖర్. ప్రస్తుతం నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నీలకంఠతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక లు ఎంఎల్వి సత్యనారాయణ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: