విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ ‘నాంది’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఇక కరోనా వల్ల ఎక్కడి షూటింగ్ లు అక్కడ ఆగిపోవడంతో ఈ సినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్ళీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి బ్రీత్ ఆఫ్ నాంది పేరుతో టీజర్ను రిలీజ్ చేస్తున్నట్టు నిన్ననే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ చిత్రం నుంచి ‘బ్రీత్ ఆఫ్ నాంది’ అనే టీజర్ను సుప్రీం హీరో సాయితేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. సినిమా ఎలా ఉండబోతోందో అల్లరి నరేష్ పాత్రని పరిచయం చేస్తూ టీజర్ ను రిలీజ్ చేశారు.
Proudly yet humbly…. presenting to you Breathe of #Naandhi ….Thank you @IamSaiDharamTej for releasing it.. https://t.co/fKPdik4d2S
— Allari Naresh (@allarinaresh) November 6, 2020
ఇక టీజర్ విడుదల చేసిన మెగా హీరో సాయితేజ్ మాట్లాడుతూ.. ”నరేష్ అన్న సినిమాలు ఫాలో అవుతూ వచ్చాను. ముఖ్యంగా నాకు ‘గమ్యం’, రీసెంట్గా వచ్చిన మహర్షి చిత్రాల్లో నరేష్ అన్న నటన అంటే చాలా ఇష్టం. ఈ బ్రీత్ ఆఫ్ నాంది టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డెఫినెట్గా హ్యూజ్ సక్సెస్ అవుతుంది.నాంది గ్యారెంటీగా హిట్ అవుతుందని టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్..” అని తెలిపారు.
ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: