యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ తెరకెక్కుతుంది. ఇటీవలే “రాధేశ్యామ్ “మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. హైదరాబాద్ లో జరిగే మరో షూటింగ్ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. పూజాహెగ్డే ప్రస్తుతం అఖిల్ హీరోగా రూపొందుతున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటలీ లో షూటింగ్ విశేషాలు , ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకొనడం గురించి పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. పూజాహెగ్డే మాట్లాడుతూ .. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి జరుగుతున్న తరుణం లో ప్రతీ 5 రోజులకు కరోనా టెస్ట్స్ చేయించుకుని షూటింగ్ లో పాల్గొన్నామనీ , టీమ్ అంతా మాస్క్ లు ధరించి షూటింగ్ లో పాల్గొన్నామనీ, కరోనా టైమ్ లో షూటింగ్ పర్మిషన్స్ చాలా కష్టమనీ , మేకర్స్ ఆ పర్మిషన్స్ మేనేజ్ చేశారనీ , హీరో ప్రభాస్ , తన స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందనీ , ప్రభాస్ షై ఫెలో కాదనీ , ఎదుటి వారి బిహేవియర్ ను బట్టి ప్రభాస్ బిహేవియర్ ఉంటుందనీ, ప్రభాస్ జోవియల్ పర్సన్ అనీ , ప్రభాస్ , తానూ సెట్స్ లో చాలా ఎంజాయ్ చేశామనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: