గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రాధేశ్యామ్ “మూవీ తెలుగు , హిందీ భాషలలో రూపొందుతుంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ , ప్రియదర్శి , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రాధేశ్యామ్ “మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని చిత్ర యూనిట్ ఇండియా చేరుకుంది. కరోనా వ్యాప్తి రిస్క్ ఉన్నా కథ ప్రకారం ఇటలీ లో తెరకెక్కించాల్సిన సన్నివేశాలు ఉండడం తో చిత్ర యూనిట్ ఇటలీ చేరుకుంది. హీరో ప్రభాస్ , పూజాహెగ్డే తదితరులతో కొన్ని ముఖ్య సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. “రాధేశ్యామ్ “మూవీ తదుపరి షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. 20 రోజుల బ్యాలెన్స్ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీ , అన్నపూర్ణ స్టూడియోస్ సెట్స్ లో జరపడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ తో “రాధేశ్యామ్ “మూవీషూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: