టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూసే హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. రీసెంట్గా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఈ సినిమాకు కూడా మిశ్రమ ఫలితమే దక్కింది. . రాధామోహన్ నిర్మించగా, మాళవికానాయర్ కథానాయికగా నటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ తాజాగా తన 15వ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడిగా వర్ష బొల్లమ్మ నటిస్తుంది. ఈ చిత్రాన్ని నంద కుమార్, భరత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించనున్నాడు. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షూటింగ్ ను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు రాజ్ తరుణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒరేయ్ బుజ్జిగా సినిమా డైరెక్టర్ తోనే మరోసారి రాజ్ తరుణ్ సినిమా చేయనున్నాడు. అంతేకాదు ఇటీవలే హైదరాబాద్ లో ఈ సినిమాను లాంచ్ చేసాడు. ఇక విజయ్ కుమార్ తో చేస్తున్న రెండవ సినిమా వనమల్లీ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో రూపొందుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: