సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. మహేష్ కు సంబంధించి కానీ.. పిల్లలు గౌతమ్, సితార లకు సంబంధించి కానీ ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే వుంటారు. అంతేకాదు పాత జ్ఞాపకాలను కూడా అపుడప్పుడు గుర్తుచేసుకుంటుంది నమ్రత. ఇక ఇప్పుడు తాజాగా తన ఇన్స్టాగ్రాములో తన పెళ్లి ఫొటోను పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక తన పెళ్లి ఫొటో పోస్ట్ చేస్తూ పిక్చర్ పర్ఫెక్ట్.. అప్పుడు.. ఇప్పుడు.. యాదృచ్చికం అనేది అసాధారణం. జీవితంపరిపూర్ణంగా సాగుతుంటుంది. పెళ్ళిళ్ళు స్వర్గ లోకంలో జరుగుతుంటాయి అని కామెంట్ పెట్టింది. నమ్రత షేర్ చేసిన ఫోటో నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మహేష్-నమ్రత కలిసి వంశీ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరమైంది. మహేష్ సినిమాలకు సంబంధించిన పనులతో పాటు ఇతర బిజినెస్లు చూసుకుంటుంది.
ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: