వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. లాక్ డౌన్ సమయాన్ని మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ టైమ్ స్పెండ్ చేశారు. మహేష్ బాబు ప్రస్తుతం బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
థాయ్ ల్యాండ్ లోని కమలాయ రిసార్ట్ , అందులోని స్పా అంటే మహేష్ బాబు కు ఇష్టమనీ , లాక్ డౌన్ కు ముందు సమ్మర్ వెకేషన్ లో మహేష్ బాబు థాయ్ ల్యాండ్ లో ఉన్న ఫొటోను ప్రీ కొవిడ్ -19 డైరీస్ అంటూ మహేష్ సతీమణి నమ్రత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో ఉన్న ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. “సర్కారు వారి పాట “మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: