కరోనా వల్ల ఇప్పటికే సినీపరిశ్రకు భారీ నష్టమే వాటిల్లింది. సినిమా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతపడి… పరిశ్రమ కోట్లాది రూపాయలను నష్టపోయింది. ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడిన సామెతలాగ మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడటం కూడా ఇండస్ట్రీని కుదేలు చేస్తుంది. ఇప్పటికే ఎంతోమంది సెలెబ్రిటీస్ కరోనా పడ్డారు.. కొంతమంది అయితే ప్రాణాలు సైతం వదిలారు. ఇక తాజాగా హీరో రాజశేఖర్ కుటుంబం కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పిల్లలు శివాని, శివాత్మికలు ముందు కరోనా నుండి కోలుకోగా ఇటీవలే జీవిత కూడా రికవరీ అవ్వడంతో ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా మరోసారి రాజశేఖర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు సిటీ న్యూరో ఆసుపత్రి యాజమాన్యం. ఇక అందులో ‘రాజశేఖర్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోంది. వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. హై ఫ్లో ఆక్సిజన్ ను ఆయనకు అందిస్తున్నాం’ అని బులెటిన్ లో డాక్టర్లు పేర్కొన్నారు.
ఇక గరుడవేగతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత వచ్చిన కల్కి కూడా బాగానే ఆడింది. అయితే కల్కి తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు రాజశేఖర్. ప్రస్తుతం నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నీలకంఠతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక లు ఎంఎల్వి సత్యనారాయణ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: