నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న తొలిసారిగా నటిస్తున్న సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈసినిమా షూటింగ్ తిరుపతిలో ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా హీరో, హీరోయిన్పై ముహూర్తం షాట్ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి క్లాప్ కొట్టారు. అనగాని సత్యప్రసాద్, ఫోర్టీన్ రీల్స్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట స్క్రిప్ట్ను మేకర్స్కు అందజేశారు.ఈ సందర్భంగా చిత్రయూనిట్ మాట్లాడుతూ.. ‘వినూత్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. కుటుంబ విలువలు, ప్రేమ, వినోదం ప్రధానంగా సాగుతుందని ’ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈరోజుతో అక్కడ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. దీనితో ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.
ఇక ఈ సినిమాతో పాటు నూతన దర్శకుడు శ్రీకార్తీక్ డైరెక్ట్ దర్శకత్వంలో ఇంకా టైటిల్ పెట్టని తెలుగు, తమిళ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: