గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీలో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రేపు దసరా పండుగ కాబట్టి ఈ సినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. రేపు ఈ సినిమా నుండి అప్ డేట్ ఇవ్వనున్నట్టు గోపీచంద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. రేపు ఉదయం 10 గంటల 5 నిమిషాలకు క్రాక్ అప్డేట్ పేలనుంది అని ట్వీట్ చేశారు. మరి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో అన్నది చూడాలి.
#Krack update gonna explode 💣 💥
Tomorrow 1️⃣0️⃣ :: 0️⃣5️⃣ AM.— Gopichandh Malineni (@megopichand) October 24, 2020
కాగా ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమాతో శ్రుతి హాసన్ టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను… సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: