గత కొద్దిరోజుల క్రితం రాజశేఖర్ కుటుంబం అంతా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే కూతుర్లు శివాని, శివాత్మికలు ఇప్పటికే కోలుకున్నారు కూడా. ఇక జీవితకు కూడా మళ్లీ కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు రాజశేఖర్ కు మాత్రం ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉండగా.. శివాత్మిక రెండు రోజుల క్రితం తన తండ్రి కరోనాతో పోరాడుతున్నారని.. మీ ప్రేమ, అభిమానం, ప్రార్ధనలు ఆయనని కాపాడతాయని భావిస్తున్నాము.. . మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను అంటూ శివాత్మిక తన ట్వీట్ చేసింది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు శివాని రాజశేఖర్ ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం నిలకడగానే వుంది.. సిటీ న్యూరో హాస్పిటల్ డాక్టర్ కృష్ణ గారు నాన్నకు బెస్ట్ కేర్.. చికిత్స అందిస్తున్నారు.. నాన్న ట్రీట్మెంట్ కు సహకరిస్తున్నారు.. మీ ప్రార్ధనలు.. అభిమానానికి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు.
Team of doctors @CitiNeuro lead by Dr.Krishna garu have been taking the best care of my father . His condition is stable and he is responding to the medication! Thanks for all ur best wishes and prayers ..means a lot 🙏
— Shivani Rajashekar (@Rshivani_1) October 24, 2020
ప్రస్తుతం రాజశేఖర్..ప్రముఖ దర్శకుడు నీలకంఠ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ హిట్ ఫిల్మ్కు రీమేక్గా రానున్న ఈ చిత్రంలో రాజశేఖర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. “యముడికి మొగుడు “మూవీ ఫేమ్ రిచా పనాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. జీవిత రాజశేఖర్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: