కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ చేస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇటీవలే హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వరల్డ్ ఆఫ్ బస్తీ బాలరాజు పేరుతో పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న లావణ్య త్రిపాఠి లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మల్లిక అనే పాత్రలో లావణ్య నటిస్తుంది. నీలం రంగు చుడీదార్ ధరించి శిలువ లాకెట్ను మెడలో వేసుకొని చాలా సింపుల్గా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
This character is ❤️ https://t.co/YMv5bj1PEk
— LAVANYA (@Itslavanya) October 24, 2020
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా తిరిగి కరోనా నిబంధనలతో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు చిత్రయూనిట్.
ఇంకా ఈసినిమాతో పాటు లావణ్య త్రిపాఠి డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో “A1 ఎక్స్ ప్రెస్ ” సినిమాలో నటిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: