పలు బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్న ఇటలీ దేశంలో షూటింగ్స్ జరపడానికై పలు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రాధేశ్యామ్ ” మూవీ ఇటలీ లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సేఫ్టీ ప్రికాషన్స్ తో “రాధేశ్యామ్ ” మూవీ షూటింగ్ సక్సెస్ ఫుల్ గా జరుగుతుంది. ఇప్పుడు మరో చిత్ర యూనిట్ ఇటలీ లో షూటింగ్ కై ప్లాన్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రంగ్ దే !” మూవీ హైదరాబాద్ లో షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ఇటలీ లో కొన్ని సాంగ్స్ , సీన్స్ చిత్రీకరణకై చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అక్టోబర్ 25 వ తేదీ ఇటలీ కి చిత్ర యూనిట్ బయలుదేరనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న “రంగ్ దే !” మూవీకి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ తరువాత హీరో నితిన్ పలు మూవీస్ కు కమిట్ అయ్యారు. హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: