ఇటీవలే తన కుటుంబం అంతా కరోనా బారిన పడిందని రాజశేఖర్ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ అంతా కరోనా బారిన పడ్డారని.. తన ఇద్దరు కూతుర్లు శివాని, శివాత్మిక కోలుకున్నారని, తనతో పాటు తన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్పష్టం చేశారు రాజశేఖర్. ఇదిలా ఉండగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కాస్త డిఫికల్ట్ గా ఉందని.. నాన్న కాస్త కష్టంగా కరోనాతో పోరాడుతున్నారు. మీ ప్రేమ, అభిమానం, ప్రార్ధనలు ఆయనని కాపాడతాయని భావిస్తున్నాము. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రార్ధిస్తున్నాను. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను అంటూ శివాత్మిక తన ట్వీట్లో పేర్కొంది. దీనితో ఆయన అభిమానులు ఒక రకంగా టెన్షన్ పడ్డారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు రాజశేఖర్ ఆరోగ్యం బాగానే ఉందని మరో ట్వీట్ చేసింది. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. `మీ ప్రేమకు, అభిమానానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. .. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది. మాకు కావాల్సింది మీ ప్రార్థనలు మాత్రమే. తప్పుడు వార్తలను ప్రచారం చెయ్యొద్దని శివాత్మిక కోరింది.
I cannot thank you all enough for your love and wishes!
But please know, he is not critical.. he is stable and getting better!
We just need your prayers and positivity💖
Thank you once again💖
Do not panic
Please do not spread fake news💜— Shivathmika Rajashekar (@ShivathmikaR) October 22, 2020
ప్రస్తుతం రాజశేఖర్..ప్రముఖ దర్శకుడు నీలకంఠ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ హిట్ ఫిల్మ్కు రీమేక్గా రానున్న ఈ చిత్రంలో రాజశేఖర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. “యముడికి మొగుడు “మూవీ ఫేమ్ రిచా పనాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. జీవిత రాజశేఖర్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: