బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “వినయ విధేయ రామ ” మూవీ పరాజయంతో కియారా అద్వానీ మళ్ళీ తెలుగు మూవీస్ లో నటించలేదు. సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” హిందీ రీమేక్ “కబీర్ సింగ్ “మూవీ లో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. ఆ మూవీ ఘనవిజయం సాధించడంతో కియారా బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ కియారా అద్వానీ కథానాయిక గా నటించిన “లక్ష్మీ బాంబ్ “, “ఇందూ కి జవానీ ” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “షేర్ షా “మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. కియారా ప్రస్తుతం “భూల్ భులయ్యా 2 “మూవీ లో నటిస్తున్నారు. “లక్ష్మీ బాంబ్ “, “ఇందూ కి జవానీ ” మూవీస్ ప్రమోషన్స్ లో కియారా బిజీగా ఉన్నారు. ఫొటో షూట్స్ లో పాల్గొని ఆ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కియారా అభిమానులను అలరిస్తున్నారు. మోడరన్ డ్రెస్ లతో ఫొటో షూట్స్ లో పాల్గొన్న కియారా ఇప్పుడు ఫెస్టివల్ మూడ్ లో ట్రెడిషినల్ డ్రెస్ లో ఫొటో షూట్ లో పాల్గొని ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందంగా ఉన్న కియారా ఫొటోలు చూసి అభిమానులు దేవకన్యలా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: