నితిన్ ‘చెక్’ మొదలైంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా… ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా `చెక్` యూనిట్ ఆమె ఫస్ట్లుక్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ విషయాన్ని నితిన్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు.
New schedule beginsss!! 😎😎 @yeletics @BhavyaCreations @Rakulpreet #priyavarrier pic.twitter.com/nPQnGcowdW
— nithiin (@actor_nithiin) October 16, 2020
సొంత బ్యానర్లో నాలుగో సినిమా
ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు నాగశౌర్య. ఇప్పటికే ఐరా క్రియేషన్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి ఆ బ్యానర్ లోనే ఛలో, నర్తనశాల, అశ్వథ్థామ చిత్రాలను నిర్మించాడు. ఇప్పుడు మరో సినిమాను తన బ్యానర్ లో చేయడానికి రెడీ అయ్యాడు నాగశౌర్య. అంతేకాదు తన బ్యానర్లో చేయబోతున్న నాలుగో సినిమాను ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు కూడా.
Excited and thrilled to be part of this surpassing entertainer.
Director #Aneesh Krishna
Music by @mahathi_sagar @YEMYENES @UrsVamsiShekar#IRACreations #ProductionNo4 pic.twitter.com/RI6NQshDRb— Naga Shaurya (@IamNagashaurya) October 16, 2020
అధీరా లుక్లోకి సంజయ్
నవంబర్ నుండి సంజయ్ దత్ ‘కేజీయఫ్ 2’ షూటింగ్ లో అడుగుపెడతారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దాదాపు నెల రోజుల పాటు ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్ ఉండనుంది. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన నార్మల్ లుక్ లోకి వచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఈ రోజు ఆయన తనకు సంబంధించిన మూడు ఫొటోలను పోస్ట్ చేసాడు. ఇందులో పూర్తిగా పాత సంజయ్ దత్లా మారిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అధీరా పాత్ర కోసం సిద్ధం అవుతున్నానని ఆయన ట్వీట్ చేసారు. సంజయ్ దత్ షూటింగ్ అయిపోతే దాదాపు సినిమా షూటింగ్ అయిపోయినట్టే అంటున్నారు చిత్రయూనిట్.
Gearing up for #Adheera!⚔️ #KGFChapter2 pic.twitter.com/Yd2FHSUUYn
— Sanjay Dutt (@duttsanjay) October 16, 2020
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి ‘శోభానాయుడు’ కన్నుమూత
కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు తుది శ్వాస విడిచారు. నెలరోజుల క్రితం ఇంటిలో జారిపడటంతో ఆమె తలకు స్వల్ప గాయమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమెకు కరోనా కూడా సోకడంతో పది రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో శోభానాయుడు తుదిశ్వాస విడిచారు.
కొత్త సినిమా సెట్లో అడుగుపెట్టిన ‘నాగ శౌర్య’
యంగ్ హీరో నాగ శౌర్య కూడా సెట్లో అడుగుపెట్టాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్ కరోనా వల్ల సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Production No 8 shoot resumes today in Hyderabad with all the necessary safety measures taken! #StaySafe & Always #WearAMask @IamNagashaurya @riturv @LakshmiSowG @Composer_Vishal @vamsi84 pic.twitter.com/LzWGrB6UmO
— Sithara Entertainments (@SitharaEnts) October 12, 2020
‘ముత్తయ్య మురళీధరన్’ బయోపిక్ కు టైటిల్, మోషన్ పోస్టర్ రిలీజ్
సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు రీసెంట్ గా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఆయన బౌలింగ్ శైలితోపాటు మ్యానరిజమ్స్ను కూడా నేర్చుకునే పనిలో పడినట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు 800 అనే టైటిల్ ను పెట్టారు అంతేకాదు మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
రాధేశ్యామ్ నుండి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ రిలీజ్
జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధే శ్యామ్. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల ఇన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఇటలీలో షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇక పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో పూజా హెగ్డే ను చూస్తుంటే చిరునవ్వులు చిందిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే ‘ప్రేరణ’ పాత్రలో నటిస్తుంది.
Here’s introducing @hegdepooja as ‘Prerana’ from #RadheShyam. #HappyBirthdayPoojaHegde
Starring #Prabhas & @hegdepooja@director_radhaa @UVKrishnamRaju garu @itsBhushanKumar @TSeries with #Vamshi #Pramod & @PraseedhaU @UV_Creations @AAFilmsIndia pic.twitter.com/wR3vGirqhN
— UV Creations (@UV_Creations) October 13, 2020
‘కేస్ 99’ ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ ఫైల్ రిలీజ్
ప్రియదర్శిని రామ్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘కేస్ 99’. నిఖిల్ ,అనువర్ణ, జంటగా మానవ సంబంధాలే ముఖ్య ఆయుధాలుగా తెరకెక్కిన చిత్రం ‘కేస్ 99’. ఇంకా ఈ సినిమాలో ‘పలాస’ఫేమ్ తిరువీర్, అపరాజిత, రోషన్, అజయ్,అశోక్రావ్,ప్రణీత పట్నాయక్ (కేర్ ఆఫ్ కంచెరపాలెం) , క్రిష్రాజ్,మనోజ్ ముత్యం,విజయ్ గోపరాజుతదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అలాగే ఫస్ట్ ఫైల్ అంటూ ఒక చిన్న వీడియో ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
Here’s the 1st File from #Case99 – ” WHY? “#Case99File1
A film by #PriyadarshiniRam @ajaykathurvar @krheash @IamThiruveeR @manoj11218 @RamaaFilmmaker @NihalKodhaty1
An @ashicarun Musical🎼 on @MangoMusicLabel pic.twitter.com/6MyGZfDK1u— Telugu FilmNagar (@telugufilmnagar) October 13, 2020
గుణ శేఖర్ ‘శాకుంతలం’
గుణశేఖర్ – రానా కాంబినేషన్ లో `హిరణ్యకశ్యప`సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. అయితే, సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టడంతో ఈ గ్యాప్ లో మరో సినిమాను లైన్ లో పెట్టాడు గుణశేఖర్. మరో పాన్-ఇండియా సినిమా ‘శాకుంతలం’ చేయాలని గుణశేఖర్ నిర్ణయించుకున్నారు. మహాభారతంలోని ఆదిపర్వంలో అద్భుతమైన, అందమైన ప్రేమ కథను శాకుంతలం చిత్రం ద్వారా ఆవిష్కరించనున్నారు గుణశేఖర్.
Before manifesting the spectacle of Narasimha Avatar on the silver screen in ‘Hiranyakashyapa’..
Presenting to you a whimsical ‘Tale of Love’ from the Adi Parva of the Mahabharata..https://t.co/eVK7a9r4Ze— Gunasekhar (@Gunasekhar1) October 9, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: