ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో స్టార్ హీరో మోహన్ లాల్ , మీనా జంటగా వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “దృశ్యం “మలయాళ మూవీ ఘనవిజయం సాధించి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ మలయాళ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసి, 150 రోజులకు పైగా ప్రదర్శించబడింది.అనూహ్య పరిస్థితులలో చిక్కుల్లో పడ్డ కుటుంబ సభ్యులను రక్షించుకొనడానికి తపన పడే వ్యక్తి గా మోహన్ లాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బెస్ట్ ఫిల్మ్ గా పలు అవార్డ్స్ అందుకున్న “దృశ్యం”మూవీ తెలుగు , కన్నడ , తమిళ, హిందీ , సింహలీస్ , చైనీస్ భాషలలో రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. చైనీస్ భాషలో రీమేక్ అయిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా “దృశ్యం”మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో స్టార్ హీరో మోహన్ లాల్ , మీనా జంటగా “దృశ్యం”మూవీ సీక్వెల్ “దృశ్యం2″మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. “దృశ్యం2″మూవీ షూటింగ్ లొకేషన్ వీడియో ను హీరో మోహన్ లాల్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: