కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ బంద్ అయిన విషయం తెలిసిందే. సుమారు 6 నెలల తరువాత మూవీ షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 15 వ తేదీ నుండి థియేటర్స్ ప్రారంభానికై కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యం లో బెంగళూరు లో కొన్ని థియేటర్స్ అయ్యాయి. సంక్రాంతి పండగకు రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు “, అల్లు అర్జున్ “అల .. వైకుంఠపురములో .. “నితిన్ “భీష్మ ” మూవీస్ బెంగళూరు థియేటర్స్ లో రీ రిలీజ్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ వర్షాలతో తీవ్ర ఇక్కట్లు కు గురైన తెలంగాణ రాష్ట్రం లో థియేటర్స్ ఓపెన్ కాలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ లో కొన్ని థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. 50 శాతం ఆక్యుపెన్సీ తో సింగిల్ స్క్రీన్స్ ను నడిపించలేమనీ , లాక్ డౌన్ సమయంలో వచ్చిన కరెంట్ బిల్స్ ను మాఫీ చేయాలనీ ఏపి ఎగ్జిబిటర్స్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏది ఏమైనా థియేటర్స్ పూర్వపు వైభవం సంతరించుకొనడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: