ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు నాగశౌర్య. ఇప్పటికే ఐరా క్రియేషన్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి ఆ బ్యానర్ లోనే ఛలో, నర్తనశాల, అశ్వథ్థామ చిత్రాలను నిర్మించాడు. ఇప్పుడు మరో సినిమాను తన బ్యానర్ లో చేయడానికి రెడీ అయ్యాడు నాగశౌర్య. అంతేకాదు తన బ్యానర్లో చేయబోతున్న నాలుగో సినిమాను ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Excited and thrilled to be part of this surpassing entertainer.
Director #Aneesh Krishna
Music by @mahathi_sagar @YEMYENES @UrsVamsiShekar#IRACreations #ProductionNo4 pic.twitter.com/RI6NQshDRb— Naga Shaurya (@IamNagashaurya) October 16, 2020
కాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోయే ఈ చిత్రానికి అనీశ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు . సాగర్ మహతి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు
ఇక ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనితో పాటుసితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: