హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఉప్పెన “మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న “ఉప్పెన “మూవీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. క్రిష్ దర్శకత్వంలో హీరో వైష్ణవ్ తేజ్ తన రెండవ మూవీ లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ కు జోడీగా సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ నటించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి మూవీ “ఉప్పెన ” రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రూపొందనున్న ఒక మూవీ కి వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంపిక అయ్యారనీ , ఈ మూవీ కి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని సమాచారం. హీరో వైష్ణవ్ తేజ్ 3వ మూవీ గా రూపొందనుంది. వరుస మూవీస్ తో టాలీవుడ్ దూసుకు పోతున్న హీరో వైష్ణవ్ తేజ్ కు ఆల్ ది బెస్ట్ చెబుదాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: