ప్రస్తుతం టాలీవుడ్ లో డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూరీ, సుకుమార్ ఇంకా పలువురు డైరెక్టర్స్ నిర్మాతలుగా మారిపోతున్నారు. ఇక ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా నిర్మాతగా మారబోతున్నాడు. ఆ డైరెక్టర్ కమ్ రైటర్ ఎవరో కాదు బివిఎస్.రవి. గతంలో సెకండ్ హ్యాండ్ అనే సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమలని తెలుగు చిత్ర సీమకు పరిచయం చేసిన బీవిఎస్ రవి ఇప్పుడు రమేష్ ను దర్శకుడిగా లాంచ్ చేస్తున్నారు. రమేష్ గతంలో గౌతమ్ మీనన్, వైవిఎస్.చౌదరి గార్ల దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొగలిరేకులు సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు సాగర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. బివిఎస్ రవికి.. నటుడు సాగర్ కి ఎప్పటినుండో సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే సాగర్ ని హీరోగా మరోమారు ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నారు రవి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ప్రాధాన్యం ఉండబోతోంది. ఇంతవరకు తెలుగు చిత్ర సీమలో ఎన్నడు రాని ఓ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో ఈ సినిమాలో కథనాయక పాత్రని తీర్చిదిద్దుతున్నట్లుగా సమాచారం. తాను స్వయంగా ఒక రచయిత కావున ఈ సినిమా కథ, కథనాలు మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: