హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ థ్రిల్లర్ కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు అందరు. ఇక చాలా ఏళ్ళ తర్వాత మరోసారి అనుష్క-మాధవన్ కలిసి నటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హేమంత్ మధుకర్ ఈ సినిమాలో అనుష్క మరియు మాధవన్ లు తిరిగి జోడీ కట్టడంపై ఓ ఆసక్తిదాయక విశేషం వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘‘వారిద్దరూ కలసి గతంలోనే ఓ చిత్రంలో నటించారని, వారు 14 ఏళ్లుగా ఒకరికొకరు తెలుసనే విషయం మొదట నాకు తెలియదు. మూగ యువతి పాత్ర పోషించేందుకు అనుష్క కనబర్చిన ఉద్వేగం మరియు గాయకుడి పాత్ర పోషించేందుకు మాధవ న్ కనబర్చిన ఆసక్తి నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఒకరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. మరొకరు ఎంతో అందంగా ఉంటారు. జంటగా చూడముచ్చటగా ఉంటారు. అది తెరపై చక్కటి కెమిస్ట్రీని పండించింది. ఇంతకుముందు కలసి నటించని వారితో పని చేస్తుంటే వారిని డైరెక్ట్ చేయడం కష్టంగా ఉంటుంది. అనుష్క, మాధవన్ లు మాత్రం ఎంతో సహజంగా నటించారు.. నేను ఆశించిన దాని కన్నా మరింతగా వారి మధ్య కెమిస్ట్రీ పండింది’’ అని దర్శకుడు హేమంత్ మధుకర్ అన్నారు.
కొంత కాలం క్రితం విమానంలో వెళ్తున్న సందర్భంలో సినిమాలో సాక్షి పాత్ర కోసం అనుష్కను నిర్మాత కోన వెంకట్ ఖాయం చేశారు. ‘‘నిజానికి సాక్షి పాత్ర కోసం మొదట్లో నా మనస్సులో వేరే వాళ్లు ఉన్నారు. విమాన ప్రయాణ సందర్భంలో కోన వెంకట్అనుష్కను కలుసుకున్నారు. ఆ పాత్రకు ఆమెను మించిన మెరుగైన ఎంపిక మరొకటి ఉండదని నాకు నచ్చచెప్పారు. అనుష్క, మాధవన్ లను మళ్లీ కలిపినందుకు, ఒక అద్భుత కళాఖండం అందిస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
మాటలు రాని, చెవులు వినబడని ప్రతిభావంతురాలైన సాక్షి కథనే నిశ్శబ్దం. ఓ విల్లా లో చోటు చేసుకున్న ఓ విషాద సంఘటనకు ఆమె ఊహించన విధంగా సాక్షి అవుతుంది. పోలీస్ డిటెక్టివ్ ల జట్టు ఆ కేసు మిస్టరీ విప్పేందుకు ప్రయత్నిస్తుంటుంది. దయ్యం మొదలుకొని తప్పిపోయిన యువతి దాకా అంతా వారి అనుమానితుల జాబితాలో ఉంటారు. నిశ్శబ్దం సినిమా మీరు మీ మునివేళ్లపై కూర్చునేలా చేసే థ్రిల్లర్. ఆ తరువాత ఏం జరుగుతుందా అని వీక్షకులకు ఉత్కంఠ కలిగిస్తుంది. చూద్దాం మరి టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచిన ఈ సినిమా.. ఆ అంచనాలను రీచ్ అవుతుందో లేదో చూద్దాం.
కాగా మాధవన్ మరియు అనుష్క శెట్టి తమిళ చిత్రం రెండు లో నటించారు. 14 ఏళ్ళ తరువాత మరోసారి ఈ జంట తెరపై కనువిందు చేయనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: