కరోనా పరీక్షకు గాను ముక్కు నుండి శాంపిల్ సేకరిస్తారనే విషయం తెల్సిందే కదా. ఇక ఈ టెస్ట్ కోసం ఒక హీరోయిన్ భయంతో వణికిపోయినట్టు తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ పలు సినిమాలతో బిజీగా వుంది. ఇక షూటింగ్ లు మొదలవుతున్నాయి కాబట్టి పాయల్ కూడా షూటింగ్స్ లో పాల్గొనడానికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఒక సినిమా షూటింగ్ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ముందస్తు జాగ్రత్తగా యూనిట్ సభ్యులకు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించారు. అలా పాయల్ కు కూడా కరోనా టెస్ట్ చేశారు. కరోనా నిర్థారణ పరీక్షకు సంబంధించిన వీడియోను పాయల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీడియోలో కరోనా పరీక్ష కోసం పాయల్ దగ్గర నుంచి శాంపిల్స్ ను తీసుకున్న సమయంలో చిన్న పిల్లలా ఏడ్చేసింది పాయల్. ఇంజక్షన్ చేయించుకునేటప్పుడు చిన్న పిల్లల్లా గోలచేసింది. కరోనా టెస్టింగ్ చాలా భయంకరంగా ఉందని.. ఫైనల్లీ నెగిటివ్ వచ్చింది.. అన్ని జాగ్రత్తలతో షూటింగ్లో పాల్గొంటున్నా అని తెలిపింది.
ప్రస్తుతం ప్రనదీప్ దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో ‘5ws’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె ఐపీఎస్ రోల్ లో ఆమె నటిస్తుంది. ఇంకా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ కీలక పాత్రలో ఇండో -పాక్ బోర్డర్ లో జరిగిన కథ తో “నరేంద్ర ” మూవీ రూపొందింది. మరి ఈ సినిమాలతో అయినా పాయల్ కు మంచి బ్రేక్ వస్తుందేమో చూద్దాం…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: